VijayaKumar

Apr 15 2024, 10:28

సుంకిశాల లో ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 14 2024, 23:36

భోగారంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామన్నపేట మండలం బోగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయి కుమార్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేడి కృష్ణ,అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, విగ్రహం కమిటీ కోశాధికారి మేడి నరసింహ, కమిటీ గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, మాజీ ఎంపిటిసి మేడి రామలింగం,మాజీ వార్డ్ మెంబర్ మేడి యాదయ్య, మెట్టు అంజయ్య, బొడ్డుపల్లి లింగయ్య, గోగు శ్రీను,చింతల మల్లేష్,మేడి చిరంజీవి,మేడి శివ,మేడి ముఖేష్ ,గుంజా ఆంజనేయులు, గుంజ మహేష్, మేడి మల్లేష్,కునూరు రాజు గౌడ్ ,జల శ్రీనివాస్,బద్దుల మహేష్ ,బద్దుల రాజు ,చిరగోని నవీన్ గౌడ్, గుంజ గణేష్, గుంజ కనకయ్య,గుంజ సత్తయ్య,ఏర్పుల కిరణ్,మేడి స్వామి,మేడి లింగస్వామి, కునూరు వెంకన్న, మోహిన్, మెట్టు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 14 2024, 14:45

వేములకొండ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని డా. బి. ఆర్. అంబేద్కర్ చౌక్ వేములకొండ గ్రామములో డా॥ బి. ఆర్.అంబెడ్కర్ గారి 133వ జన్మదిన వేడుకలు డా. బి. ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు బుంగ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

 ఈ కార్యక్రమానికి MPTC లా మండల ఫోరమ్ అధ్యక్షులు సామ రాంరెడ్డి గారు మండల పరిషత్ కోప్షన్ సభ్యులు SK రసూల్ , మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయకులు పులిపల్పుల రాములు , గౌడ సంఘం అధ్యక్షులు పులిపాలుపుల మల్లేష్ గౌడ్ మాజీ వార్డ్ నెంబర్ మంటిపెల్లి రమేష్ గ్రామ న్యాయకులు,అంబట మోహన్ గాజుల యాదగిరి మరియు వివిధ పార్టీల న్యాయకులు పాల్గొన్నారు

ఇట్టి కార్యక్రమములో సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి లింగస్వామి గారు ,S మహేందర్ గారు , P. జగన్,V. లచ్చయ్య, R. గిరి, J గణేష్, M. ప్రభాకర్, J. మత్స్యగిరి, R. మత్స్యగిరి, S. నవీన్ , S. చింటూ, B. నవీన్, B. అనిల్, P.అఖిల్, R. ఉదయ్, D.మచ్చి, B. సత్తి, V. శివ, R. పవన్, V. నాని, D.మల్లేష్, బుంగ నంద కిషోర్, బుంగ రోషిని తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 18:42

ఈనెల 23న భువనగిరిలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ


 ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 మంగళవారం తేదీన భువనగిరి పట్టణంలో జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయడం కోసం నల్గొండ రోడ్ లోని MNR గార్డెన్స్ లో సమావేశం నిర్వహించి వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు విశ్వహిందూ పరిషత్ యాదాద్రి ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్ మాట్లాడుతూ జరగబోయే ర్యాలీలో యువకులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని భవిష్యత్తులో హిందువులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారరు జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన యువత తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసి హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ వ్యవస్థా ప్రముఖక్ తాడం పాండు విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవుల సాయి పట్టణ అధ్యక్షులు కేమోజు మల్లికార్జున్ కార్యదర్శి సాల్వేరు వేణు వల్లబోజు సతీష్ జిల్లా ధర్మ ప్రసార్ ప్రముఖక్ కోకల సందీప్ మందిర్ అర్చక పురోహిత్ ప్రముఖక్ ఆకుల అనిల్ జిల్లా సహ కార్యదర్శి పోచంగళ్ళ బాబు పాదరాజు మనోజ్ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను కో కన్వీనర్ మార్క శ్రావణ్ జిల్లా గోరక్ష ప్రముక్ పొన్నాల వినయ్ పట్టణ కన్వీనర్ నమిల నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ అవినాష్ రెడ్డబోయిన బాలరాజు బొక్క మాధవరెడ్డి ఎంకే శ్రీధర్ బిజెపి నాయకులు చందా మహేందర్ ఆకుతోట రామకృష్ణ గుప్తా కర్రే ప్రవీణ్ హిందు వాహిని కడారి శివ కందరి శ్రీధర్ ఊదరి రామరాజు పూస శ్రీనివాస్ సాయి విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

     

VijayaKumar

Apr 13 2024, 18:36

పోచంపల్లి పట్టణ కేంద్రంలో PDSU ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 52వ వర్ధంతి


ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సాధారణ విద్యార్థిగా వచ్చి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలకు ఎదురునిలిచి విద్యార్థులందరికీ అండగా నిలిచిన జార్జిరెడ్డి నేటి విద్యార్థిలోకానికి ఆదర్శం అని ప్రగతిశీల యువజన సంఘం పి.వై.ఎల్.పోచంపల్లి పట్టణ కార్యదర్శి పడాల శివ అన్నారు.

 జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో పి.డి.ఎస్.యూ.ఆధ్వర్యంలో జార్జిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో ప్రగతిశీల ఆలోచనలతో, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తి, వారితో మమేకమై ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా విద్యా రంగ సమస్యలపై, విద్యార్థి హక్కులకై, విద్యార్థులపై చేస్తున్న మూకదాడులపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని, జార్జిరెడ్డి ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాడో వారే నేడు పాలకులుగా మారి 10 ఏళ్లుగా దేశంలో అరాచక పాలన చేస్తూ, దేశాన్ని విధ్వంసం చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నారని, మరో దఫా అధికారంలోకి రావడానికి కులాల పేరిట, మతాల పేరిట చిచ్చులు పెడుతూ, దేశభక్తి పేరుతో యువతను పెడదోవ పట్టించే విధంగా పాకిస్తాన్, చైనా బూచి చూపి ఉద్వేగాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే కుయుక్తులు పన్నుతున్నారనీ,అసలు దేశ స్వతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఆర్ఎస్సెస్,బీజేపీ నేడు సినిమా రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అబద్ధపు కథలతో సినిమాలు తీసి, అదే నిజమైన చరిత్రగా, బ్రిటీష్ వారి బూట్లు తుడిచిన వారిని దేశభక్తులుగా చూపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని,

దేశంలోని విద్యారంగాన్ని విధ్వంసం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకొచ్చారనీ, దేశంలో మోడీ షా సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు. పోచంపల్లి పట్టణ నాయకులు మోజేశ్, కళ్యాణ్, చందు, రాము, సురేష్, జైపాల్, అరవింద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 18:30

భువనగిరిలో ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థులని శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న బాలుర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని హాస్టల్ సిబ్బంది, టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 17:35

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు కారణమైన ప్రిన్సిపాల్ , కేర్ టేకర్ లను సస్పెండ్ చేయాలి:AISF

యాదాద్రి భువనగిరి జిల్లా లో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో గత రెండు రోజులుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి విపరీతమైన వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు అని విద్యార్థుల కు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని సంబంధిత ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు 

గత రెండు రోజులుగా భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో ఏడుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిసిందని ఒక విద్యార్థికి విషమంగా ఉండడంతో నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారని పరిస్థితి ఇంత విషమంగా ఉన్నప్పటికీ సంబంధిత ప్రిన్సిపాల్, రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్ గారు ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగిందని, ఆర్ సి ఓ గారు తో మాట్లాడుతూ గత సంవత్సరం మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండల కేంద్రంలో కూడా 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేస్తూ ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు ఫుడ్ పాయిజన్ కారణమైన కేర్ టేకర్ ని సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ )గా డిమాండ్ చేస్తు మాట్లాడడం జరిగింది

నిత్యం గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గురై విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఇకనైనా జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాల లపైన సంబంధిత అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాష్ట్ర రకాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.

VijayaKumar

Apr 13 2024, 16:29

రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి : ఏ ప్రదీప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి


 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం లోని హక్కులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ కోరారు. శనివారం మండల పరిధిలోని జనంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల/కళాశాల లో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బాలికలకు చదవుకునే అవకాశం లేదని , స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం లో కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి భారతీయుడు చదువుకునే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ముఖ్యంగా బాలికలకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించారని దానిని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలికలు చదువు తప్ప మరే ఆలోచన లేకుండా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. నేటి విద్యార్థులు, యువత ఆన్ లైన్ లో అవసరం లేని వాటి జోలికి వెళ్ళి, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 

విశిష్ట అతిథిగా విచ్చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. చందన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో పాటు దేశ నాయకులు జీవిత చరిత్రను, కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లాంటి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్లు కలలు కనండి, ఆ కాలంలోనే నిజం చేసుకోండని ఆమె విద్యార్థులను కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్యానల్ &రిటైనర్ న్యాయవాదులు మామిడి వెంకట్ రెడ్డి ,దంతూరి సత్తయ్య, డేవిడ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు స్వామి, సీనియర్ న్యాయవాది జగతయ్య, బార్ అసోసియేషన్ కల్చరల్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, పాఠశాల/కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ స్మిత మేడం, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీఫ్ , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 16:17

ఈనెల 19న నామినేషన్ కి వేలాదిగా తరలిరావాలి: ఎండి జహంగీర్ సిపిఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి


ఈనెల 19న జరుగు నామినేషన్ కు వేలాదిగా తరలిరావాలని సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేశాయని గత అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మరిచిపోయి కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డారని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు మరిచి పరిపాలన సాగించాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సూచికగా కావాలని నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ పరిష్కారం గాని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రజా ఉద్యమాలు జరిగిన అధికార ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అరకోర వసతులతో సరైన వైద్యం అందించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు సమస్యల పరిష్కారం కోసం సిపిఎంకు ఓటేసి గెలిపించాలని, 19న జరిగే నామినేషన్ కు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, శాఖ కార్యదర్శి దండు గిరి, సీనియర్ నాయకులు దండు యాదగిరి, నాయకులు దండు పద్మారావు, ఆడెపు గిరి, మాయ రాణి, దండు స్వరూప, దండు ధనలక్ష్మి, నాగరాణి, స్వాతి, బట్టు లక్ష్మి, బట్టుపల్లి నవీన్ కుమార్, ఎనబోయిన లింగం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 15:46

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు అస్వస్థత


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారానే విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారని ,అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శుక్రవారం జరగగా అధికారులు జప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.